Header Banner

మిథున్ రెడ్డి విచారణలో ట్విస్ట్! అసలు సాయిరెడ్డి ఇంట్లో ఏం జరిగిందంటే!

  Sun Apr 20, 2025 17:49        Politics

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న మద్యం కుంభకోణం తీవ్ర కలకలం రేపుతోంది. అప్పట్లో నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయించడం ద్వారా భారీగా డబ్బులు వెనకేసుకున్నట్లు వైసీపీ ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ అధికారులు ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు.

 

ఉదయం విజయవాడలోని పోలీసు కమిషనర్ కార్యాలయానికి విచారణ కోసం వచ్చిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని దాదాపు 8 గంటల పాటు మద్యం కుంభకోణంపై ప్రశ్నించారు. ముఖ్యంగా మద్యం కుంభకోణం ఎలా జరిగింది, ఎలా డబ్బలు చేతులు మారాయి, దీని వెనుక కుట్రలో ఎవరెవరు ఉన్నారనే అంశాల చుట్టూనే మిథున్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు మిథున్ రెడ్డి సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు సమాచారం.

 

ఇది కూడా చదవండి: చంద్రబాబుపై కేశినేని నాని పోస్ట్! టీడీపీలో రీఎంట్రీ ప్రచారం వేళ..!

 

 

అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఇంట్లో మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన చర్చల వివరాలను కూడా మిథున్ రెడ్డిని అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి తాజాగా సాక్షిగా ఈ కేసు విచారణకు హాజరైన సందర్భంగా తన ఇంట్లో జరిగిన చర్చల్ని వెల్లడించారు. దీంతో వాటి ఆధారంగా ఇవాళ మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే వీటిపైనా మిథున్ రెడ్డి నేరుగా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.


సిట్ విచారణ అనంతరం బయటికి వచ్చిన మిథున్ రెడ్డి.. కేసుగురించి ఇప్పుడు పూర్తిగా మాట్లాడలేనని తెలిపారు. ఇది అంతా కట్టుకథ అన్నారు. గతంలో అనేక ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. మైన్స్‌లో అవకతవకలు జరిగాయన్నారని, ఏ ఆరోపణా ఇప్పటివరకు ప్రూవ్‌ చేయలేదన్నారు. అలాగే తమ సొంత భూమిని అటవీభూమి అంటూ ఆరోపణలు చేశారని మిథున్‌ రెడ్డి ఆరోపించారు.


ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు! ఎస్సైకి సస్పెన్షన్ వేటు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #MithunReddy #SaiReddy #PoliticalTwist #APPolitics #InvestigationUpdate #BreakingNews